పరామర్శించిన ఎమ్మెల్యే పద్మ

పరామర్శించిన ఎమ్మెల్యే పద్మ

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలీఘన్పూర్ మండలం కూచన్ పల్లి గ్రామంలో ఇటీవల  అనారోగ్యానికి గురైన వార్డు మెంబర్ ఆకుల యాదగిరి తండ్రి వెంకట్,  బిల్డింగ్ పైనుంచి పడిన వడ్ల వెంకట్ ను ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. అన్ని విధాల అండగా ఉంటానన్నారు.  వెంట జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, పాక్స్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మెదక్ మాజీ జడ్పీటీసీ మామిళ్ల ఆంజనేయులు, నాయకులు మాణిక్య రెడ్డి, కొంపల్లి సుభాష్ రెడ్డి, పడాల సతీష్, గ్రామశాఖ అధ్యక్షులు తొగిట మల్లయ్య, వార్డ్ మెంబెర్స్ కుర్మబయ్యన్న,  ఆకుల యాదగిరి, మన్నే యాదగిరి, గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ లో చేరిక కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పద్మ సమక్షంలో చేరారు.  వార్డు సభ్యులు దుర్గారి ఎల్లవ్వ, ఈర్ల కిషన్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తలారి సంజీవులు, అరిక రాములు, దుర్గారి రమేష్, లింగాల అనిల్, సంపత్, చింతకింది మల్లేశం, సాతెల్లి శ్రీనివాస్, తొగిట వెంకట్ తోపాటు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలను గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు