దసరా వేడుకల్లో ఉద్రిక్తత - పోలీసుల జోక్యంతో సద్దు మణిగిన వివాదం

దసరా వేడుకల్లో ఉద్రిక్తత - పోలీసుల జోక్యంతో సద్దు మణిగిన వివాదం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ లో దసరా శమీ పూజ వేడుకల సభలో ఉద్రిక్తత నెలకొంది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగల్ పేట మహాలక్ష్మి అమ్మవారి దేవాలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బిజెపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు హాజరయ్యారు. అయితే కేవలం ఇంద్రకరణ్ రెడ్డిని మాత్రం స్టేజి పైకి ఆహ్వానించి మహేశ్వర్ రెడ్డిని ఆహ్వానించక పోవటం వివాదానికి కారణమైంది. ఈ ఘటనతో మహేశ్వర్ రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ఇరు పక్షాల వారికి నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దు మణిగింది.