అడవుల పరిరక్షణ అందరి బాధ్యత - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అడవుల పరిరక్షణ అందరి బాధ్యత - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర కీలకమని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ దినోత్సవ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం నిర్వహించిన అవగాహనా ర్యాలీ ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అడవుల ఆవశ్యకత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు