జిల్లాకు చేరుకున్న ఎన్నికలవ్యయ పరిశీలకులు ఉమాకాంతద్రుపాటీ..

జిల్లాకు చేరుకున్న ఎన్నికలవ్యయ పరిశీలకులు ఉమాకాంతద్రుపాటీ..

ముద్రప్రతినిధి, మహబూబాబాద్:లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  మహబూబాబాద్  పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థుల, ఎన్నికల ప్రచార ఖర్చులు పరిశీలించేందుకు ఎన్నికల కమీషన్ కేటాయించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉమాకాంతద్రుపాటీ గురువారం జిల్లాకు చేరుకున్నారు.మహబూబాబాద్  లోని ఆర్అండ్ బి అతిథిగృహంలో జిల్లా ఎన్నికలఅధికారి, జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ  సుధీర్ రాంనాథ్ కేకన్ తో కలిసి ఎన్నికల వ్యయపరిశీలకులు ఉమాకాంతద్రుపాటీ ని మర్యాదపూర్వకంగా కలిసారు. పూలమొక్కను  అందించి  స్వాగతం పలికారు.