హోండా యాక్టివా పైనుంచి పడి యువకుడు మృతి

హోండా యాక్టివా పైనుంచి పడి యువకుడు మృతి

కేసముద్రం, ముద్ర: స్కూటీపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం - తొర్రూరు ప్రధాన రహదారిపై అయ్యగారి పల్లి వద్ద జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఎండి యాకూబ్ పాషా మంగళవారం (23) హోండా యాక్టివా పై అయ్యగారి పల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి కింద పడగా తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మరణించాడు. మృతుని తండ్రి రాజ్ మహమ్మద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తిరుపతి తెలిపారు.