రేవంత్​ రెడ్డిపై వైఎస్​ షర్మిల ఫైర్​

రేవంత్​ రెడ్డిపై వైఎస్​ షర్మిల ఫైర్​

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిపై వైఎస్​ షర్మిల ఫైరయ్యారు. రేవంత్​ రెడ్డి అభద్రతగా ఫీలవుతున్నారని అన్నారు. నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందోనని ఆయన భయపడుతున్నారని అన్నారు. నాది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీ ఎక్కడివారని ప్రశ్నించారు. సోనియా గాంధీ ఇటలీ కదా అని అన్నారు. సంస్కృతిని అర్థం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలన్నారు. నాకు చీర, సారె పెడతారట...ఇక్కడ రాజకీయాలు చేయొద్దట. ఈ లెక్కన సోనియా గాంధీకి, రేవంత్​ రెడ్డికి చీర , సారె పెడతామన్నారు. రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు. రేవంత్​ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అన్నారు.