రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం


ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వేట్రాక్ పై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని రైల్వే పోలీసులు బుధవారం కనుగొన్నారు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఈ మహిళ  గుర్తు తెలియని రైతు కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. పూల డిజైన్ తో తెలుపురంగు చీర, పసుపు రంగు బ్లౌజ్ వేసుకుని ఉందని, హిందువులా కనిపిస్తోందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు. ఈ మహిళ వివరాలు తెలిసిన వారెవరైనా 8712568454 లేదా 9100742260మ  మొబైల్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియపరిచాల్సిందిగా రైల్వే పోలీసులు చెబుతున్నారు