హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే కడప ఎంపిగా పోటీ చేస్తున్నా :వైఎస్ షర్మిల

హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే కడప ఎంపిగా పోటీ చేస్తున్నా :వైఎస్ షర్మిల

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే కడప ఎంపిగా పోటీ చేస్తున్నా ” అని ఎపిసిసి చీఫ్‌ షర్మిల అన్నారు. శుక్రవారం కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో షర్మిల బస్సు యాత్రను ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ … కడప లోక్‌ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్‌ రెడ్డి ఉన్నారని అన్నారు.

హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే తాను కడప ఎంపిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. ధర్మం కోసం ఒకవైపు తాను… డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారని… ఎవరిని గెలిపించాలనేదే ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్‌ మళ్లీ టికెట్‌ ఇచ్చారని విమర్శించారు. హంతకులను కాపాడేందుకే జగన్‌ సిఎం పదవిని వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.