ఇక నల్ల నేలపై ఎన్నికల నగారా...

ఇక నల్ల నేలపై ఎన్నికల నగారా...
  • ఈ నెల 27వ తేదీన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ముహూర్తం ఖరారు

  
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: ఇక నల్ల నేలపై తెలంగాణ లో ఎన్నికల నగారా...మోగబోతోంది. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కోసం సోమవారంహైదరాబాదులో కార్మిక శాఖ అధికారి తో భేటీ అయిన కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరేణి అధికారులతో ఈనెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించునున్నట్లు తేది ఖరారు చేశారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ తో పాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు విప్లవ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. మళ్లీ సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలలో ఎన్నికల కోలాహలం ఏర్పడనుంది.