4886.92 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

4886.92 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక

వ్యవసాయ, మార్కెటింగ్ , టర్మ్ లోన్స్ రంగాలకు  3579.37 కోట్లు సూక్ష్మ , చిన్న, మధ్య తరగతి సంస్థలకు 1063.79 కోట్లు విద్యా రుణాలు  40.50 కోట్లు గృహ రుణాలు 176 కోట్లు ప్రాధాన్యత  రంగాలకు   రూ. 4886.92 కోట్లు ప్రాధాన్యతలేని రంగాలకు రూ. 2595.00 కోట్లు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : 2023- 24 ఆర్థిక సంవత్సరానికి  రూ. 4886.92 కోట్లుతో వార్షిక రుణ ప్రణాళిక  ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

మంగళవారం  కలెక్టరేట్ సమావేశం మందిరంలో జరిగిన డి సి సి/ డి ఎల్ ఆర్ సి సమావేశంలో కలెక్టర్ పాల్గొని 2023--24 వార్షిక రుణ ప్రణాళిక ను కలెక్టర్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రుణ ప్రణాళికలో ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయం వాణిజ్యం, విద్య,గృహ రుణాలు మౌలిక సదుపాయాలు పునరుత్పాదక రంగాలకు రూ.4886.92 కోట్లు, ప్రాధాన్యత లేని రంగాలకు రూ. 2595 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పంట ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్ కోసం 216282  మంది రైతులకు రూ.2302.32 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వనున్నట్లు, వ్యవసాయానికి టర్మ్ లోన్ కింద  9554 మందికి రూ.295.35  కోట్లు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అన్నారు. వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలకు సంబంధించి  11337 రైతులకు రూ.  222.12 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు 1140 మంది రైతులకు 94.99 కోట్లు, వ్యవసాయ టర్మ్ రుణాలకు 4432 రైతులకు 664.59 కోట్ల రూపాయలు, సూక్ష్మ సంస్థలకు13873 యూనిట్లకు 277.41 కోట్లు, చిన్న సంస్థలకు 7349 యూనిట్స్ కు 330.75 కోట్లు, మధ్యతరగతి సంస్థలకు 787  యూనిట్లకు 455.63 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. విద్యారుణాలు కింద  827మందికి  40.50 కోట్లు, గృహ రుణాల కింద 1772 మందికి 176 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాల కోసం 444 యూనిట్లకు17.52 కోట్లు, పునరుత్పాదక శక్తి క్రింద 487 యూనిట్లకు 9.74 కోట్లు ఇతర ప్రాధాన్యతా లేని రంగాలకు మందికి 2595 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు.   ఆయా రంగాలకు కేటాయించిన రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు
ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద రైతుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేసిన డబ్బులను పంట రుణం కింద రికవరీ చేయవద్దని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఎదుగుతున్న కారణంగా నూతన పరిశ్రమలు స్థాపించడానికి అర్హులైన వారికి రుణాలు అందించాలని ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన పథకాలతో పాటుఏ పి వై పథకం తక్కువగా ఉన్నందున పారిశ్రామిక కార్మికులను, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు మరి కుటుంబ సభ్యులు అర్హులైన ప్రతి ఒక్కరిని చేర్పించాలని సూచించారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులు అందరు సమిష్టిగా కృషి చేసి జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పోస్టర్ ఆవిష్కరించారు


ఈ సమావేశంలో  లీడ్ డిస్టిక్ మేమేనేజర్ టీవీ సీతా రామాంజనేయులు, నాబార్డ్ ఏజీఎం  ప్రకాష్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సతీష్ , జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి మనోహర్ రావు, ఆర్బిఐ ఏజీఎం బేహేరా,  ఎస్బిఐ ఏజిఎం రవి శేఖర్, యూబిఐ,కెనరా బ్యాంక్ ఏజిఎంలు, 
బ్యాంకర్స్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.