ప్రమాద బీమా చెక్కును పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ప్రమాద బీమా చెక్కును పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ముద్ర,పానుగల్:- పానుగల్ మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దొంతన మోని నాగన్న గత నాలుగు నెలల క్రితం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపల వేటకు వెళ్లగా చేపల వల చుట్టుకుని మృతి చెందాడు.మృతునికి బిఆర్ఎస్ పార్టీ లో సభ్యత్వం ఉన్నందున రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు మంజూరు అయింది.బుధవారం చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మామిళ్ళపల్లి శ్రీధర్ రెడ్డి, మాందాపురం ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటయ్య నాయుడు,రవీందర్ గౌడ్,దశరథ నాయుడు,హనుమంత్ రెడ్డి,మిద్దె కృష్ణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు