పోలీసు ప్రజావాణికి 15 ఫిర్యాదులు

పోలీసు ప్రజావాణికి 15 ఫిర్యాదులు

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి 15 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కె మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యలు అని అడిగి సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదులపై సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భూ ఫిర్యాదులు 5,  భార్యాభర్తల గొడవలు 4, పరస్పర గొడవలు 6,  మొత్తం 15 ఫిర్యాదులు అందినట్లు ఆమె తెలిపారు.