ఆర్థిక ఇబ్బంధి కారణంగా వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బంధి కారణంగా వ్యక్తి ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల: కోరుట్ల పట్టణం అర్బన్ కాలనీకి చెందిన ఇల్లెందుల గంగాధర్ 45 అనే వ్యక్తి , ఆర్థిక ఇబ్బంధి కారణంగా సరైన ఉపాధి లేక పోవడంతో కుటుంబ పోషణ బారమై, జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయినట్లు పోలీసులు వెళ్ళడించారు.

మృతుడి భార్య లత ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై కిరణ్ కుమార్ అన్నారు. పోలిసులు అందించిన వివరాల ప్రకారం గత ఐదు సంవత్సరాల క్రితం మృతుని సొంత గ్రామమైన కోనరావుపేట నుండి కోరుట్ల పట్టణానికి వచ్చి జీవిస్తున్నాడు. మృతుడికి   బాబు, పాప ఇద్దరు పిల్లలు వున్నారు. వృత్తిరిత్యా అవుసుల పని చేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు.