టీయూడబ్ల్యూజే  మీడియా డైరీ ఆవిష్కరణ

టీయూడబ్ల్యూజే  మీడియా డైరీ ఆవిష్కరణ

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) మీడియా డైరీ-2024ని  సమాచార శాఖ కమిషనర్ కె అశోక్ రెడ్డి బుధవారంనాడు ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన సమాచారం జర్నలిస్టులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటూ టీయూడబ్ల్యూజేను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై. నరేందర్ రెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఏ. మాజీద్, జాతీయ కార్యవర్గ సభ్యులు కే. సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు దొంతు రమేష్, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేష్, కిరణ్, యాదగిరి, చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులు శిగ శంకర్ గౌడ్, హమీద్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.