పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. ఆదివారం పదవ తరగతి 1993–1994 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. మెదక్ గణేష్ స్టడీ పాయింట్ ట్యూషన్ విద్యార్థులు 30 సంవత్సరాల తర్వాత విద్యార్థులు, ఉపాధ్యాయులు కలుసుకొన్నారు. ఈ సందర్భంగా చిన్నచిన్న కొట్లాటలను తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకొన్నారు. ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే ముప్పై ఏళ్ళ క్రితం బోధించిన ఉపాధ్యాయులు శ్రీహరి, దత్తాత్రేయ కులకర్ణి, శ్రీనివాస్, ప్రసాద్, నారాయణరెడ్డిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందచేశారు. అనంతరం సహపంక్తి భోజనం చేశారు.