రైలు కింద పడి యువకుడు మృతి

రైలు కింద పడి యువకుడు మృతి

తూప్రాన్, ముద్ర: ఇంటి నుండి వెళ్లిన యువకుడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఇమ్రాన్ (25) మంగళవారం సాయంత్రం ఇంటినుండి వెళ్లి తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రైలు కింద పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి రైల్వే పోలీసులు చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి హాస్పిటల్ కు తరలించారు.