ఘనంగా ‘ముద్ర’ వార్షికోత్సవ వేడుక

ఘనంగా ‘ముద్ర’ వార్షికోత్సవ వేడుక

ముద్ర, తెలంగాణ బ్యూరో : అనతి కాలంలోనే పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ దినపత్రిక వార్షికోత్సవ వేడుకలు మంగళవారం హైదరాబాద్ లోని పత్రిక ప్రధాన కార్యాలయంలో అట్టహానంగా జరిగాయి. పత్రిక ఎడిటర్​ వై. నరేందర్​రెడ్డి, ఎగ్జిక్యూటివ్​ ఎడిటర్​ ఎ. ఇంద్రారెడ్డి కేక్​ కట్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో పత్రిక పురోగతిని వివరించారు. అందరి సహాకారంతో ప్రజల పక్షాన వారి గొంతుకగా నిలిచి.. అన్ని వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ‘ముద్ర’ వేసుకున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్​​డెస్క్​ ఇన్​చార్జి జహంగీర్​ పాష, స్టేట్​ బ్యూరో చీఫ్​ సంపత్​కుమార్, సెంట్రల్​​డెస్క్​ సెకెండ్​ఇన్​చార్జి  శివకోటి​రామ్​ మనోహర్, సబ్​ ఎడిటర్లు పెండ్యాల రమేశ్, ఓగోటి కిరణ్, భీమరాజు హరనాథ్, నాగేందర్, మల్లికార్జున్, బ్యూరో ఇన్​చార్జిలు శ్రీనివాస్, శరత్, మహ్మద్​ బాబా, ఫీచర్​పేజీ ఇన్​చార్జి  ఉమా మహేశ్వరి, సినిమా రిపోర్టర్​పర్వీన్, చీఫ్​ఆర్టిస్ట్​దుబాసి రూపశ్రీరెడ్డి, సీనియర్​ఆర్టిస్టులు సముద్రాల స్వామి, జె. శ్రీను, మహ్మద్​జక్రియ, జక్కిడి శ్రీధర్​ రెడ్డి,  బి. పరమేశ్​గౌడ్, టెక్నికల్​ ఇన్​చార్జి నాగేందర్, చీఫ్​ ఫొటో గ్రాఫర్​ రమణాచారి, హెచ్​ఆర్​సునీల్, సిబ్బంది భవాని, ఎస్.​మనోజ్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.