ఘనంగా ‘ముద్ర’ వార్షికోత్సవ వేడుక
ముద్ర, తెలంగాణ బ్యూరో : అనతి కాలంలోనే పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ‘ముద్ర’ దినపత్రిక వార్షికోత్సవ వేడుకలు మంగళవారం హైదరాబాద్ లోని పత్రిక ప్రధాన కార్యాలయంలో అట్టహానంగా జరిగాయి. పత్రిక ఎడిటర్ వై. నరేందర్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎ. ఇంద్రారెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో పత్రిక పురోగతిని వివరించారు. అందరి సహాకారంతో ప్రజల పక్షాన వారి గొంతుకగా నిలిచి.. అన్ని వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ‘ముద్ర’ వేసుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్డెస్క్ ఇన్చార్జి జహంగీర్ పాష, స్టేట్ బ్యూరో చీఫ్ సంపత్కుమార్, సెంట్రల్డెస్క్ సెకెండ్ఇన్చార్జి శివకోటిరామ్ మనోహర్, సబ్ ఎడిటర్లు పెండ్యాల రమేశ్, ఓగోటి కిరణ్, భీమరాజు హరనాథ్, నాగేందర్, మల్లికార్జున్, బ్యూరో ఇన్చార్జిలు శ్రీనివాస్, శరత్, మహ్మద్ బాబా, ఫీచర్పేజీ ఇన్చార్జి ఉమా మహేశ్వరి, సినిమా రిపోర్టర్పర్వీన్, చీఫ్ఆర్టిస్ట్దుబాసి రూపశ్రీరెడ్డి, సీనియర్ఆర్టిస్టులు సముద్రాల స్వామి, జె. శ్రీను, మహ్మద్జక్రియ, జక్కిడి శ్రీధర్ రెడ్డి, బి. పరమేశ్గౌడ్, టెక్నికల్ ఇన్చార్జి నాగేందర్, చీఫ్ ఫొటో గ్రాఫర్ రమణాచారి, హెచ్ఆర్సునీల్, సిబ్బంది భవాని, ఎస్.మనోజ్కుమార్తదితరులు పాల్గొన్నారు.