టెన్త్ పేపర్ లీకేజీ వాస్తవం కాదంటున్న విద్యాశాఖ
![టెన్త్ పేపర్ లీకేజీ వాస్తవం కాదంటున్న విద్యాశాఖ](https://mudranews.in/uploads/images/2023/04/image_750x_642ac934b95dd.jpg)
తాండూరులో టెన్త్ పేపర్ లీకేజీ వాస్తవం కాదంటున్న తెలంగాణ విద్యాశాఖ. ప్రశ్నపత్రం ఫోటోలు తీసి గ్రూపులో పోస్టు చేసి తర్వాత డిలీట్ చేసిన ఇన్విజిలేటర్ బందెప్ప. తర్వాత ప్రైవేటు స్కూలు టీచర్కి పంపిన నిందితుడు. ప్రైవేటు టీచర్ చిట్టీలు తయారుచేసేవరకు అయిన సమయం ఉదయం 11.45 గంటలు. పరీక్ష మధ్యాహ్నం 12.30కు ముగుస్తుండటంతో ఏం చేయాలో తోచక పేనర్ను ఎవ్వరికీ పంపని ప్రయివేటు టీచర్. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విద్యాశాఖ. ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే బందెప్ప ఫోటోలు తీశాడని పోలీసుల అనుమానం.