అఖిల్ బాయ్ కైసా హై... ఆత్మీయంగా పలకరించి, ఘాడంగా ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్...

అఖిల్ బాయ్ కైసా హై... ఆత్మీయంగా పలకరించి, ఘాడంగా ఆలింగనం చేసుకున్న మంత్రి కేటీఆర్...

సిద్దిపేట మసీదు వద్ద ఆత్మీయ మిత్రునితో కేటీఆర్ మాటామంతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేటలో గురువారం నాడు జరిగిన మంత్రుల పర్యటనలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ స్థానిక మసీదు వద్దకు వచ్చారు. అక్కడ పట్టణం చుట్టూ ఇటీవల వేసిన రింగ్ మెయిన్ మంచినీటి పైప్ లైన్ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించేందుకు వచ్చారు. మంత్రి కారు దిగగానే పోలీసు రక్షణ వలయాన్ని ఛేదించుకొని కేఎస్ అఖిల్ అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ ముందుకు ఊరికి వచ్చారు. వెంటనే కేటీఆర్ అఖిల్ బాయ్ కైసా హై అన్నారు. దాంతో అఖిల్ కేటీఆర్ ను ఘఢంగా అలుము కున్నారు. మై హచ్చా హాయ్ సాబ్ అంటూ అఖిల్ మంత్రికి జవాబు ఇచ్చారు. 

కొద్దిసేపు వారిద్దరు అలానే ఆత్మీయంగా పలకరించుకోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కొద్దిసేపు అనంతరం మంత్రి కేటీఆర్ హరీష్ రావులు అక్కడ యధావిధిగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అఖిల్ను 'ముద్ర ప్రతినిధి' కలువగా తనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి 46 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు కెసిఆర్ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ఆ పార్టీకి వెళ్లి కేసీఆర్ వెన్నంటే ఉన్నానని చెప్పారు. కేటీఆర్ ను చిన్నప్పటినుండి తాను ఆత్మీయంగా పలకరిస్తుంటానని అందుకే తనని మర్చిపోకుండా పేరు పెట్టి పిలుస్తాడని చెప్పారు.ఈరోజు కూడా ఒకరినొకరం కుటుంబ యోగక్షేమాల గురించి మాట్లాడుకున్నామని చెప్పారు.