రైతుబజారును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు
- రేట్లు ఏలాఉన్నాయి..అంటూ ఆరా ..
- మరింత నీట్నెస్ పెంచాలంటూ ఆదేశం
ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:-సిద్దిపేట రైతు బజారు ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆకస్మిక చేశారు.ఆదివారం ఉదయం మంత్రి హరీష్ రావు రైతు బజార్ కు వెళ్లి కూరగాయల రేట్లు అడిగి తెలుసుకున్నారు.మీకు అనుకున్నగిరాకీ ఎలా ఉంది.. గిట్టుబాటు అవుతుందా.? అంటూ రైతుల ను అడిగి తెలుసుకున్నారు.రైతుబజారులో సౌలత్ లు ఏట్లా ఉన్నాయని, ఇంకేమైనా కావాల్న అంటూ కొనుగోలు దారులను,రైతులను మంత్రి హరీశ్ రావు అడిగారు.
నిత్యం వేలాది మంది వచ్చిపోయే రైతు బజారును మరింతగా పరిశుభ్రంగా ఉంచాలని ఎస్టేట్ అధికారి ప్రభాకర్ ను ఆదేశించారు. అపరి శుభ్రంగా ఉన్న ప్రాంతాలను చూపుతూ ఇట్లా అయితే ఏలా అంటూ ఎస్టేట్ అధికారి ప్రభాకర్ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ములక్కాయలు విక్రయిస్తున్న ఓ మహిళా రైతుతో ముచ్చటిస్తూ గిట్టుబాటు అవుతుందా అంటూ ఆరా తీశారు.కిలో 50 రూపాయలు ధర పలుకుతున్నదని రైతు వివరించింది. ఈ ప్రాంతంలో నీళ్లు బాగానే ఉన్నాయని సంబురంగా చెప్పింది. నేను ఐదేకరాలు ములక్కాయ పంట పెడతానని మంత్రి చెప్పుకొచ్చారు.
ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు, కారం,పసుపు విక్రయ కేంద్ర నిర్వాహకురాలు లక్ష్మీతో మంత్రి ముచ్చటించారు. వ్యాపారం ఏలా కొనసాగుతున్నదని ఆరా తీశారు.ఇర్కోడ్ తొక్కులు, మిట్టపల్లి పప్పులు హైదరాబాదు మార్కెట్లో సైతం ఎగుమతి చేయాలని, ఇందుకు పోలీసు కమిషనర్ శ్వేత కావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత-వేణుగోపాల్ రెడ్డికి సూచించారు.