రసమయి కే సంపూర్ణ మద్దతు

 రసమయి కే సంపూర్ణ మద్దతు
  • అంబేద్కర్ సంఘం నాయకులు

తిమ్మాపూర్ ముద్ర : బిఆర్ఎస్ మానకొండూరు అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ కే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అంబేద్కర్ సంఘం నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో మండల అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మానకొండూరు నియోజకవర్గంలో దళితుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అంతేకాకుండా దళితుల అభివృద్ధి కొరకు నిత్యం కృషి చేస్తూ, వారి అభ్యున్నతికి పాటుపడుతూన్నారు.ఇటీవలే తిమ్మాపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అమలు చేస్తానని ప్రకటించిన సందర్భంగా దళితుల బాగు కొరకు మంచి అవకాశాన్ని సీఎం చే ప్రకటింపజేసిన  ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మనందరం ఇట్టి విషయాన్ని  తలుచుకొని కారు గుర్తుకు మరో సారి ఓటు వేసి రసమయి బాలకిషన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అంతే కాకుండా అంబేద్కర్ సంఘ భవనాల నిర్మాణానికి, మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు రసమయి బాలకిషన్  ఎనలేని కృషి చేస్తూ నియోజవర్గంలోని గ్రామ గ్రామాన అంబేద్కర్ ఆశయాలకు, వారి అభ్యున్నతికి అనుగుణంగా దళితులకు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో దళిత సంఘం సీనియర్ నాయకులు బోయిని కొంరయ్య,మాతంగి లక్ష్మణ్,వంతడుపుల సంపత్, పారునంది జలపతి,సంగుపట్ల మల్లేషం,గంగిపల్లి సంపత్,కోయడ మురళి,బొర్రా రవీందర్,నగునూరి బాపు, వంశీ,కవ్వంపల్లి పద్మ, తటిపెల్లి చంద్రమౌళి,శనివారపు యాదగిరి,కవ్వంపల్లి రాజయ్య, కుంభాల లత,రోడ్డ రమేష్,శ్రీనివాస్,కనకం రాములు,కన్నం నర్సయ్య,తూర్పాటి అజయ్ ఉన్నారు.