వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

శంకరపట్నం ముద్ర నవంబర్ 28:మండల కేంద్రంలో కేశవపట్నం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపించడంతో మంగళవారం కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై వాహనాలను కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి సాయుధ బలగాలతో కలిసి తనిఖీ చేశారు. ఎన్నికల సందర్భంగా డబ్బులు, మద్యం రవాణా చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన కరీంనగర్ వరంగల్ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను తనిఖీ చేశారు. పలుచోట్లలో సోదాలు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి సాయుధ బలగాలు పాల్గొన్నారు.