పుస్తెమట్టెలు అందజేత

పుస్తెమట్టెలు అందజేత

ముద్ర, వీణవంక: మండలం లోని నర్సింగాపూర్ గ్రామంలో తల్లిదండ్రులు లేని నిరుపేద కుటుంబానికి చెందిన హర్షిని వివాహం కార్తీక్ తో జరిగింది.వధువు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతిథి బిల్డర్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి స్పందించి హర్షిని వివాహానికి పుస్తే మట్టెలు కానుక గా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పుస్తె మట్టేలను రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపక అధ్యక్షులు పోతరవేన సతీష్, రాజి రెడ్డి, చంద్రమౌళి, దూడం నరసయ్య, ముద్దం తిరుపతి, కొమురయ్య, సతీష్, సాగర్, కరుణాకర్, శ్రీను, సమ్మయ్య సార్, గణేష్ రెడ్డి, అంజి, అడిగోప్పల సత్యనారాయణ, రాజమల్లు యువ సైన్యం సభ్యులు వివాహ వేడుకకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.