దొరికిన వెండి నాణాలు

దొరికిన వెండి నాణాలు
  • పంపకాల్లో పంచాయతీ
  • రంగంలోకి అధికారులు

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు గురిగిలో వెండి నాణాలు దొరికాయి. గురిగిని పగలగొట్టి నానాలను కూలీలు పంచుకునే క్రమంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో విషయం బయటికి పొక్కడంతో అధికారులు రంగ ప్రవేశం చేశారు. గ్రామంలో ఉపాధి హామీ పని జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని  తాసిల్దార్ విచారణ చేపట్టారు. నాణేలు ప్రభుత్వానికి అప్పగించాలని కూలీలను ఆదేశించారు.

గురిగిలో మొత్తం 27 వెండి నాణేలు దొరికినట్టు ఉపాధి హామీ కూలిలు తాసిల్దార్ కు వెల్లడించారు. కూలీల వద్ద నుండి అధికారులు నాణాలను స్వాధీనం చేసుకున్నారు. మీర్ మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలంలో 1869 నుంచి 1911 వరకు చలమణిలో  ఉన్నాయని పురావస్తు శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో  తాసిల్దార్ కనకయ్య, ఎస్ఐ ప్రమోద్ రెడ్డి,  ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఆర్ఐ అనిలా పాల్గొన్నారు