రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తాం.

రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తాం.

చిగురుమామిడి ముద్ర న్యూస్: మండలంలోని బొమ్మనపల్లిలో  బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం గ్రామ భూత్ అధ్యక్షుడు మామిడి రమేష్ అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసి  శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మండల పార్టీ ఉపాధ్యక్షుడు కంది శంకర్, స్థానిక బిజేపి నాయకులు  మాట్లాడుతూ...బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపి బండి సంజయ్ అరెస్టును వారు తీవ్రంగా  ఖండించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. రానున్న ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం లో  పార్టీ గెలుపే  లక్ష్యంగా పని చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  భూత్ అధ్యక్షుడు రమకాంత్ రెడ్డి, ఆరేళ్ల శ్రీనివాస్ గౌడ్, శంకరపల్లి రాకేష్, గాజులు నరేందర్ రెడ్డి, కీసర వెంకటేష్,మామిడి రమేష్, మామిడి దేవి, చట్ల తిరుపతి, బోల్లీ మహేష్, బండి సందీప్,పిళ్లి అనిల్, కాసర్ల సమ్మయ్య, మచమల్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.