ఏపీ ప్రజలకు బిగ్ షాక్ -రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
![ఏపీ ప్రజలకు బిగ్ షాక్ -రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_664c0b96304bd.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఆరోగ్య శ్రీ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి (మే 22వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని వెల్లడించింది. గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయని పేర్కొంది. వీటి విలువ సుమారు రూ.1,500 కోట్ల వరకు ఉందని వెల్లడించింది.