బిజెపి నేత నందు జనార్ధన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక 

బిజెపి నేత నందు జనార్ధన్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరిక 
  •  పార్టీలోకి ఆహ్వానించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గానికి చెందిన బీజేపీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్ రెడ్డి  వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం ప్రభుత్వ ఉద్యోగనికి రాజీనామా చేసి 4 సంవత్సరాలుగా నియోజక వర్గంలో బీజేపీ బలోపేతానికి ఎనలేని కృషి చేశానని, అటువంటి నాకు పార్టీ తీరని అన్యాయం చేసిందన్నారు. పార్టీలో కష్టపడ్డ వారికి కాకుండా ప్యారాష్యుట్ లకే టికెట్లు లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టాన నిర్ణయానికి మనస్థాపానికి గురై  సభ్యత్వానికి రాజీనామా చేసిబిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.   పార్టీలో ఏ పని అప్పజెప్పినా శక్తివంచన లేకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.ఆయన వెంట సుమారుగా వందమందికి పైగా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇంచార్జీ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి,  లక్ష్మణ్, కొండల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.