తల్లిపాలు బిడ్డకు అమృతం
ముద్ర ప్రతినిధి, మెదక్:తల్లిపాలు బిడ్డకు అమృతంలాంటివని, పుట్టినబిడ్డకు వెంటనే ముర్రుపాలు తాగించాలని అంగన్వాడీ టీచర్లు రేణుక, స్మరణ అన్నారు. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా శుక్రవారం మెదక్ పట్టణంలోని పిట్లంబేస్–2 అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు, గర్భిణీలకు తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపారు. బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాలని పిల్లలకు రోగ నిరోధక శక్తినిస్తాయని తెలిపారు. కేంద్రం పరిధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ లక్ష్మీదేవీ, బాలింతలు, గర్భవతులు, అంగన్ వాడీ చిన్నారులు పాల్గొన్నారు.