సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేతలు

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేతలు

ముద్ర,తెలంగాణ:- అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చేరగా.. తాజాగా, శనివారం బీజేపీ నుంచి మరో ఇద్దరు నేతలు ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ పులిమామిడి రాజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే మక్తల్ బీజేపీ నేత జలంధర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.