బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్  సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరిన ముత్తారం గ్రామస్తులు...

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్  సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరిన ముత్తారం గ్రామస్తులు...

ముద్ర, ప్రతినిధి పెద్దపల్లి:- ముత్తారం మండలంలోని  (కాసర్ల గడ్డ బీసీ క్వాటర్స్) గ్రామస్తులు దాదాపు 100 మంది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్  సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సునీల్  రెడ్డి కండువాలు వేసి పార్టీ లో మహిళలను ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మంథని ప్రాంతంలోని ప్రజలు ఈ ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నరన్నారు.  కాంగ్రెస్ అసమర్ధతను నిలదీయండి, అభివృద్ధి చేసాము అని చెప్పుకొనే నాయకులు ముత్తారం రోడ్ల పరిస్థితి చూస్తే అర్థం అవుతలేదన్నారు. మీ అభివృద్ధి ఈ ప్రాంతంనుండి ఇసుక తరలించుకుపోవడమా...  ఈ ప్రాంతానికి మీరు చేసిన  న్యాయం ఏమిటీ??గృహలక్ష్మి, దళిత బంధు పథకాలు పేద ప్రజల కోసమా? లేక అధికార  పార్టీ నాయకుల కోసమా అన్నారు.ఈకార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పోతారవేణి క్రాంతికుమార్, మండల అధ్యక్షులు పెయ్యాల కుమార్, సీనియర్ నాయకులు అమ్ము శ్రీనివాస్, కెక్కర్ల మహేష్,దేవునిరి కొమ్మురయ్య, అలువోజు మహేందర్, కాశివోజుల మల్లయ్య, కోరబోయిన మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.