కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు

హుజూర్ నగర్ ముద్ర:సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు.శుక్రవారం హైదరాబాద్ లోని బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యాలయంలో ఆయనను కలిసిన రెండవ వార్డ్ కౌన్సిలర్ జక్కుల శంబయ్య నాలుగవ వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు లను కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఉత్తమ్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ లో చేరిన కౌన్సిలర్లు  మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని పూలమాలతో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గెల్లి రవి, పిన్నెల్లి సంపత్, అమరబోయిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.