భయపెట్టి ఓట్లు వేయించుకోవడమే వీరి పని

భయపెట్టి ఓట్లు వేయించుకోవడమే వీరి పని

మహాదేవపూర్, ముద్ర: మహాముత్తారం మాజీ జడ్పిటిసి మందల రాజిరెడ్డి పై జరిగిన దాడిని బిఆర్ఎస్ నాయకులు ఖండించారు. గతంలో శ్రీపాదరావు ఎన్నికలలో పంజాబ్ కమాండోలను దింపి ప్రజలను భయభ్రాంతులను చేసి ఓట్లు వేయించుకున్నాడని, నేడు కర్ర స్మగ్లర్లను, మాజీ నక్సలైట్లను దింపి శ్రీధర్ బాబు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహాదేవపూర్ సర్పంచ్ శ్రీపతి బాబు విమర్శించారు. మంథనిలో ప్రచార రథం పై దాడి, లక్కారంలో మరో దాడి, మహా ముత్తారంలో మాజీ జెడ్పిటిసి పై దాడి ఇందుకు నిదర్శనం అన్నారు. కొద్దిరోజుల క్రితం దుద్దిళ్ల శీను బాబు సూరారం గ్రామంలోని వ్యక్తిని వేధించి సూపర్ మార్కెట్ మూత పెట్టుకునేలా చేసాడని విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గెలిస్తే బయట తిరిగే పరిస్థితి ఉండదని ఇతర పార్టీలలో కూడా పనిచేయలేని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పనిచేసిన ఎమ్మెల్యే పుట్ట మధు దేశపు ఒక్కరిపై కూడా కేసు పెట్టించలేదని రెండు లక్షల మంది ప్రజలకు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారని విమర్శించారు. కొత్తగా ఓటు సంపాదించుకున్న యువకులు సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. మాజీ మంత్రి కి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే మాజీ లతో దాడులు చేయిస్తున్నారని ఆన్కారి ప్రకాష్ విమర్శించారు. దాడిలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళ నేత కేదారి గీత డిమాండ్ చేశారు. ఓడేటి స్వప్న, వెంకటస్వామి, బీసీ నాయకుడు బాబురావ్, జాడి గట్టయ్య, అన్కారి ప్రభాకర్, వంశీ, మెరుగు లక్ష్మణ్, అలీమ్ తదితరులు పాల్గొన్నారు.