బిఆర్ఎస్ కు ప్రజాబలం లేకనే గుండాయిజం

బిఆర్ఎస్ కు ప్రజాబలం లేకనే గుండాయిజం

మహాదేవపూర్, ముద్ర: బిఆర్ఎస్ గూండాలు ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంథని ముత్తారం మండలంలోని ఓడేడ్ సర్పంచ్ పై దాడి చేయడం సిగ్గుచేటమే మహాదేవపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్ అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీకి ప్రజలలో బలం లేకనే గుండాయిజాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులకు పాల్పడే వారిని ప్రజలు ఛీ  కొడతారని ఆయన హెచ్చరించారు. ఇలాంటి దాడులకు పాల్పడడం ద్వారా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటమిని అంగీకరించినట్లయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న మద్దతును చూసి ఓర్వలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బక్కారావు పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట రాజబాబు, సింగిరెడ్డి చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి మథీన్ ఖాన్, మహాదేవపూర్ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్లు పాల్గొన్నారు.