బడీడు పిల్లలను బడిలో  చేర్పించాలి

బడీడు పిల్లలను బడిలో  చేర్పించాలి

సర్పంచ్ జేరిపోతుల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి : సిద్దిపేట కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన చేస్తున్నారని,బడిడులు పిల్లలను బడిలో, అంగన్వాడి పిల్లలను అంగన్వాడి కేంద్రాల కు పంపాలని  సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రాముని పట్ల గ్రామ సర్పంచ్ జేరిపోతుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం   రాముని పట్ల, అల్లిపూర్ , ఎల్లయ్యపల్లి, కాసర్లపల్లి గ్రామంలో తో పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడీడు వచ్చిన పిల్లలను బడిలో చేర్చాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలకు దీటుగా సౌకర్యాలు ప్రభుత్వం  ఏర్పాటు చేసిందన్నారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ బొల్లం కుమార్   పాఠశాలల అధ్యాపకులు శ్రీనివాస్ రెడ్డి ఎల్లం శంకర్ విజయశాంతి లక్ష్మి రవీందర్ రెడ్డి అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.