భారత్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి

భారత్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలి

 దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపు

ముద్ర  ప్రతినిధి, సిద్దిపేట: భారత్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్ రావు పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను చూడాలన్నదే ప్రధాని కోరిక అని అందుకోసం నిరంతరం శ్రమిస్తున్నాడని రఘునందన్ రావు చెప్పారు. జిల్లా కేంద్రంలోని వీపంచి కళనిలయంలో నెహ్రూ యువ కేంద్రం అధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఉత్సవ్ కార్యక్రమాన్ని శనివారం నాడు ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు.

ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఎండ్లు పూర్తి అయినందుకు జనాభా లో మొదటి స్థానంలో ఉన్న దేశం అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని ప్రధాని మోడీ కోరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ,యువజన సర్వీసుల శాఖ అధికారి నాగేందర్, నెహ్రూ యువక కేంద్ర అధికారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  విద్యార్థులకు ఐదు రకాల సాంస్కృతిక సాహిత్య పోటీలను ఏర్పాటు చేశారు.