మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

మహారాష్ట్ర బ్యాంకును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్
  • ప్రజలకు చేరువై సేవలు అందించాలి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో  ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాంకును లీడ్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ అధికారులతో కలిసి మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బ్యాంకును సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మహారాష్ట్ర బ్యాంకు కార్యకలాపాలు మరింతగా విస్తరింపజేసి ప్రజలకు విస్తృత సేవలు అందించాలని కోరారు.అలాగే ప్రభుత్వ పథకాల లో అర్హులైన వారికి రుణా ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో  లీడ్ బ్యాంకు మేనేజర్ కౌశల్ కిషోర్ పాండే స మహారాష్ట్ర బ్యాంకు జోనల్ మేనేజర్ శుశాంత్ కుమార్ గుప్తా,  మహారాష్ట్ర బ్యాంక్ మేనేజర్ ఎన్ రాకేష్ బ్యాంక్ సిబ్బంది పరమేష్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు