బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరణ

భూదాన్ పోచంపల్లి,ముద్ర: భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని బుధవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అదేవిధంగా ఈనెల 25న జరిగే స్వామివారి కల్యాణానికి ఎమ్మెల్యే ని దేవాలయ కమిటీ ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ అంకం వినోద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భారత లవకుమార్ ,10వ వార్డ్ కౌన్సిలర్ మోటే రజిత రాజు, ధర్మకర్తలు మోటే మహేష్, చేరాల సుధీర్, వేషాల మురళి, కూరపాటి బాబు, పొనమోని కావ్య, వంగూరి బాలకృష్ణ, పాపని ముత్యాలు,గోషిక శివకుమార్, చెరుకు శ్రీకాంత్, చేరాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.