సీఎం సహాయనిధి 48,000 చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ వేదనగర్ కు చెందిన లబ్దిదారుడు కేదర్ శెట్టి తండ్రి నారాయణ శెట్టి, చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, చేతుల మీదుగా సీఎం సహాయ నిధి 48,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.