నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:- ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.ఈ సభకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్ఖండ్‌ సీఎం చంపయి సొరెన్‌, తేజస్వీ యాదవ్‌, అఖిలేశ్‌ యాదవ్‌, ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌, సీపీఐ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, శివసేన, ఎన్సీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ తరుణంలోనే.. ఆదివారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌ రెడ్డి ముంబై వెళ్లనున్నారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు యాత్ర ముగింపు సభలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొననున్నారు.