సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన - వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన  - వారికి రైతు భరోసా ఇవ్వడం కుదరదు

ముద్ర,తెలంగాణ:- తెలంగాణలో రైతు భరోసా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 100 రోజుల పాలనపై ఆదివారం మాట్లాడుతూ.. 5 ఎకరాలలోపు ఉన్న దాదాపు 62 లక్షల మంది రైతులకు రైతుబంధు డబ్బు అందించామన్నారు. భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు, చెట్లు, లేఅవుట్లకు ఇవ్వడం కుదరదన్నారు. వ్యవసాయ భూమి ఉన్న వారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని తేల్చి చెప్పారు.