అంబేడ్కర్‌ కు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

అంబేడ్కర్‌ కు నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర,హైదరాబాద్:- రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. అంబేడ్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు. సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.