కేటీఆర్కు కొండా సురేఖ స్ట్రాంగ్ కౌంటర్
ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మంత్రి కొండా సురేఖ కౌంటర్ ఇచ్చారు. “మహిళలకు రూ.2,500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వీరు మూడెకరాల భూమి నుంచి రూ.3 వేల నిరుద్యోగభృతి వరకు 100 హామీలు ఇచ్చారు. మామ్మల్ని ప్రశ్నించే హక్కు కేటీఆర్ కు లేదు. ఇచ్చిన గ్యారెంటీలను కాంగ్రెస్ కచ్చితంగా అమలు చేస్తుంది.బీఆర్ఎస్ ఖాళీ అవుతోండటంతో కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు” అని వ్యాఖ్యానించారు.