శ్రీకాళహస్తి వద్ద ప్రమాదం.. దంతాలపల్లిలో విషాదం..!!

శ్రీకాళహస్తి వద్ద ప్రమాదం.. దంతాలపల్లిలో విషాదం..!!
  •  దైవదర్శనానికి వెల్లివస్తూ..దారిలోనే మృత్యువాత.. 

ముద్రప్రతినిధి,మహబూబాబాద్: దైవదర్శనానికి వెళ్ళిన ఆ..కుటుంబాన్ని రోడ్డుప్రమాదం తీవ్రవిషాదంలోకి నెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి-శ్రీకాళహస్తి మార్గంలో శ్రీకాళహస్తి సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన నెమ్మది దినేష్ కన్నా,నెమ్మదిరాంబాబు,నెమ్మది అశోక్ లు అన్నదమ్ములు వీరి ఆడపడుచు తిరుమలలో స్వామివారి సన్నిధిలో ఓ..వేడుక నిర్వహించగా ముగ్గురు అన్నదమ్ములు కారులో బయలుదేరివెల్లారు.

వారితోపాటు వారితల్లి నెమ్మది వెంకటమ్మ, దినేష్ కన్నా కూతుర్లు బానితాక్షరి, శశాంతఅక్షరి కూడా వెల్లారు. కార్యక్రమం పూర్తి చేసుకొని, దైవదర్శనం చేసుకొని దంతాలపల్లికి తిరుగు ప్రయాణం అయ్యారు.  అయితే తిరుపతి-కాళహస్తి రోడ్డు మార్గంలో తెల్లవారుజామున బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నెమ్మది అశోక్(34), నెమ్మది వెంకటమ్మ(60), శశాంతఅక్షరి (6) అక్కడికక్కడే మృతిచెందారు. దినేష్ కన్నా, రాంబాబు, బానితాక్షరి కి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ..విషాదవార్త ఉదయాన్నే పోన్ ద్వారా దంతాలపల్లికి చేరుకోవడంతో గ్రామమంతా తీవ్రవిషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న భారాస నాయకులు కిషోర్ తో పాటు మరికొందరు బాదితుల కుటుంబసభ్యులు శ్రీకాళహస్తి బయలుదేరివెల్లారు. శుక్రవారం ఉదయం పోస్ట్ మార్టం పూర్తి అయితే రాత్రి వరకు మృతదేహాలు, క్షతగాత్రులను దంతాలపల్లికి తీసుకవస్తామని విషాదఘటనస్థలానికి బయలుదేరి వెల్లిన భారాస నాయకులు కిషోర్ తెలిపారు.