ఓ.బి.సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చరణ్ 

ఓ.బి.సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా చరణ్ 

ముద్ర, కోరుట్ల:కోరుట్ల పట్టణానికి చెందిన ఉరుమడ్ల చరణ్ ను జగిత్యాల.ఓ.బి.సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమిస్తు జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఓ.బి.సి మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్ చరణ్ కు అందించారు. చరణ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నా నియమకానికి సహకరించిన ఎంపి ధర్మపురి అర్వింద్,  బీజేపీ జిల్లా అధ్యక్షులు మోరపెల్లి సత్యనారాయణ, చిట్నేని రఘు, చెట్లపల్లి సుకేందర్ గౌడ్, ఆకుల రంజిత్, కోరుట్ల బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు కలాల సాయి చందు కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ  కార్యక్రమం లో ఓబీసీ మోర్చా జిల్లా అధికార ప్రతినిధులు భూమి రమణ, మర్రిపెళ్లి సత్యం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జూంబర్తి దివాకర్, గిన్నెల శ్రీకాంత్, పాల్గొన్నారు.