73 వ రోజుకు చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆత్మగౌరవ యాత్ర

73 వ రోజుకు చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆత్మగౌరవ యాత్ర

ముద్ర దుబ్బాక :సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర 73వ రోజుకు చేరింది. ఆదివారం నాడు నియోజకవర్గ పరిధిలోని మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో ఆత్మగౌరయాత్రను ఆయన కొనసాగించారు.హాత్ సే జోడో యాత్ర లో భాగంగా దుబ్బాక ఆత్మ గౌరవ యాత్ర నిర్వహిస్తూ ప్రజల సమస్యలను, కష్టసుఖాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.