ఎమ్మెల్యేపై పీఎస్ లో ఫిర్యాదు

ఎమ్మెల్యేపై పీఎస్ లో ఫిర్యాదు

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: హనుమ కొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్చపల్లి నవ్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, అతని అనుచరుల పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్టేషన్ ఘన్ పూర్ మండల మహిళా అధ్యక్షురాలు జ్యోస్నా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో పనిచేస్తున్న మహిళను లొంగ తీసుకునేందుకు ఎమ్మెల్యే ఆమెను పలు రకాలుగా వేధించడం బాధాకరమన్నారు.

ఎమ్మెల్యేకి సహకరిస్తున్న అనుచర మహిళ ప్రజా ప్రతినిధుల లైంగిక వేధింపుల నుండి నవ్యను కాపాడాలని, దుర్బుద్ధితో కుటుంబాలను కూల్చే విధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.