ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డులు

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు సిబ్బందికి రివార్డులు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ముద్ర: సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని..... సీసీఎస్ శంషాబాద్ జోన్, సిసిఎస్ బాలానగర్ జోన్, సిసిఎస్ మాదాపూర్ జోన్  కు చెందిన పోలీసు సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను శుక్రవారం సైబరాబాద్ కమీషనర్  స్టీఫెన్ రవీంద్ర అభినందించి రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర  మాట్లాడుతూ సిసిఎస్ పోలీసులు నేర నివారణ మరియు నేర ఛేదన పై దృష్టి సారించాలన్నారు. క్రైమ్ డిటెక్షన్ పై రోజువారి సమీక్షలు చేసుకోవాలన్నారు. సిబ్బంది ముఖ్యంగా స్థానిక నేరగాళ్లు మరియు అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించాలన్నారు. సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల పోలీస్ పోలీసులతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కానిస్టేబుల్ కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బందితో, ఎస్ఐ ఎస్ఐ ర్యాంకు సిబ్బందితో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ర్యాంకు సిబ్బందితో క్రైమ్ డిటెక్షన్ విషయంలో టచ్ లో ఉండాలి అన్నారు.

2022లో 60 శాతం క్రైమ్ డిటెక్షన్ రేటు ఉందన్నారు. 75 నుంచి 80 శాతనికి క్రైమ్ డిటెక్షన్ రేట్ పెరగాలన్నారు. ఉత్తమ పనితీరును ఇలాగే కొనసాగించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్వింగ్ మొదటి స్థానంలో ఉండాలన్నారు. సిబ్బందికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో  జాయింట్ సీపీ అవినాష్ మహంతి, అడ్మిన్ శ్డిసిపి యోగేష్ గౌతమ్,, ఏడిసిపి క్రైమ్స్ జి. నరసింహారెడ్డి సిసిఎస్ ఎసిపి కె. శశాంక్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాలరాజు, సిసిఎస్ మాదాపూర్ ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, సిసిఎస్ శంషాబాద్ ఇన్స్పెక్టర్ నరసింహ, ఎస్‌ఐలు  మరియు ఇతర పోలీసు సిబ్బంది  ఉన్నారు.