మునిసిపల్ కమిషనర్ కు పిర్యాదు...

మునిసిపల్ కమిషనర్ కు పిర్యాదు...

మోత్కూర్(ముద్ర న్యూస్):డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షులు గుమిడేల్లి పరుశురాములు అధ్వర్యంలో  దుకాణాలపై మునిసిపల్ కమిషనర్ సి శ్రీకాంత్ కు  పిర్యాదు చేశారు .మెత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోనూ సుమారు వందల దుకాణాలు ఉన్నాయి. ఇట్టి యజమానులు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలా నిబంధనలు తుంగలో తొక్కి దుకాణాల యజమానులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

వినియోగదారులు కొన్న వస్తువులకు ఎలాంటి బిల్స్ ఇవ్వడం లేదు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ యదేచ్చగా వినియోగిస్తున్నారు. దుకాణాలకు ఎలాంటి పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇట్టి సమస్యలను తక్షణమే చర్యలు తీసుకోవాలని మన మున్సిపాలిల్ కమిషనరికి పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి అన్నదాస్ మత్స్యగిరి ,  ముఖ్య సలహాదారులు శివరాత్రి మత్యగిరి ,ముఖ్య సలహాదారులు ఊర సారయ్య, కమిటీ సభ్యులు ఇటికాల నరేష్, గుగ్గిళ్ళ కృష్ణ, కురిమిల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు