గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్...

గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్...

ముద్ర,హైదరాబాద్:- రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్‌ పార్టీలో టాలీవుడ్ డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ఎఫ్ఐఆర్ లో 8వ నిందితుడిగా క్రిష్ పేరు చేర్చారు పోలీసులు. క్రిష్ స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు. డ్రగ్స్ పార్టీ జరిగే సమయంలో వివేదకానందతో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు నిర్ధారణ చేయాల్సి ఉంది.అయితే స్నేహితులు పిలిస్తేనే ఆ పార్టీకి వెళ్లానని.. డ్రైవర్ రాగానే అక్కడి నుంచి బయటకు వచ్చినట్లుగా క్రిష్ తెలిపాడు. ఇక డ్రగ్స్‌ కేసులో పరారీలో ఉన్న ఏడుగురు నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు. హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.