బ్రిడ్జి వేడెల్పు చేయాలని వినతి.

బ్రిడ్జి వేడెల్పు చేయాలని వినతి.

మోత్కూర్(ముద్ర న్యూస్):  మోత్కూరు బిక్కేరు  బిడ్జిని  రెండు వరుసల (డబుల్) రోడ్డు  చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్నికోరారు.మంగళవారం ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏఓ జగన్ కు బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లడుతూ దాదాపు నాలుగు  దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ బిక్కేరు బిడ్జి సింగిల్ గా ఉండటం వల్ల తరుచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.  

గత ప్రభుత్వ హయాంలో ఇసుక లారీలు ఎక్కువగా ఈ బిడ్జి గుండా హైదరాబాద్ వెళ్లడంతో బిడ్జి నాణ్యత లోపించి గుంతమయంగా తయారైందన్నారు.నల్లగొండ నుంచి వరంగల్ వెళ్లాలంటే ఈ బిడ్జి గుండా వెళ్తే తక్కువ కి.మీ.ప్రయాణం తో  వెళ్లే అవకాశం ఉందన్నారు..అదే విధంగా గుండాల, ఆలేరు, జనగామ దేవరుప్పుల, కొడకండ్ల , పాలకుర్తి ప్రాంతాల ప్రజలకు ఈ బిడ్జినే ప్రధాన రహదారి అని చెప్పారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఈ సింగిల్ గా ఉన్న బిడ్జిని రెండు వరుసలు( డబుల్)  రోడ్డును చేయాలని ఏఓ జగన్ ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిస్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.